
శ్రీలంకకు తీవ్ర నిరాశ.. మహిళల ఛాంపియన్స్ట్రోఫీ 2027 వేదిక భారత్ కు తరలింపు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మొట్టమొదటిసారిగా నిర్వహించనున్న ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ-2027 ఆతిథ్య హక్కులను శ్రీలంక నుంచి భారత్కు బదిలీ చేసింది. శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)లో ప్రభుత్వ జోక్యం, కొనసాగుతున్న పరిపాలన సంక్షోభం కారణంగా ఈ మార్పు చేసినట్లు ఐసీసీ బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.2027 ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ), వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలు మ్యాచ్లకు వేదికలుగా నిలవనున్నాయి. ఆసక్తికరంగా, 2025 మహిళల వన్డే ప్రపంచకప్ను భారత్ గెలుచుకున్న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.లంక బోర్డులో సంక్షోభమే కారణం వాస్తవానికి ఈ టోర్నమెంట్కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డులో అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకుని, రాజ్యాంగ, పరిపాలన సంస్కరణల కోసం ఓ తాత్కాలిక 'ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ'ని ఏర్పాటు చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెట్ బోర్డుల వ్యవహారాల్లో రాజకీయ జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వ నియమిత కమిటీలను గుర్తించబోమని స్పష్టం చేసిన ఐసీసీ, ఆ కమిటీ ఏర్పడినప్పటి నుంచి ఎస్ఎల్సీ ప్రతినిధులను బోర్డు సమావేశాలకు దూరంగా ఉంచుతోంది. ఈ సంస్కరణలు పూర్తికాని నేపథ్యంలోనే టోర్నీని తరలించాలని నిర్ణయించినట్లు ఐసీసీ పేర్కొంది.శ్రీలంకకు ప్రత్యామ్నాయ ఆతిథ్య దేశం కోసం బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాల నుంచి కూడా ప్రతిపాదనలు రాగా, అన్నింటినీ పరిశీలించిన అనంతరం ఐసీసీ బోర్డు భారత్ను ఎంపిక చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది.మహిళల