© 2026 nimisham.in

అల్లవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంకకు చెందిన జనసైనికుడు రోళ్ల ప్రేమ్కుమార్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందడం కలచి వేసిందని ఉప...
అల్లవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంకకు చెందిన జనసైనికుడు రోళ్ల ప్రేమ్కుమార్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందడం కలచి వేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. జీవితం ఎంతో అమూల్యమైనదని, ర్యాలీలు, బ్యానర్ల ఏర్పాటులో స్వీయ భద్రతకు పాధాన్యం ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రేమ్కుమార్ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని రాష్ట్ర ఫౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన జనసేన ఎమ్మెల్యేలతో కలిసి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి పార్టీ తరఫున రూ.5 లక్షల సాయం అందించారు. మృతుడి తండ్రి సతీష్తో మాట్లాడారు. ఇంజినీరింగ్ చదువుతూ ఇటీవలే ఉద్యోగానికి ఎంపికైన కుమారుడు మృతి చెందడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ మృతుడి సోదరుడు ఆదినారాయణకు ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలు గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాద్, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది.