© 2026 nimisham.in

Pithapuram Police: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ రావణ్ను పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నిన్న హైదరాబాద్లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్లపై రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పిఠాపురానికి చెందిన జనసేన నాయకుడు బొజ్జా కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అలాగే, పలు వేదికలు, యూట్యూబ్ ఛానళ్లలో కూడా పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై రావణ్ను ప్రశ్నిస్తున్నారు. విచారణ పూర్తయిన అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.