మెరుపు వరదల వేళ భారత్ ఆపన్నహస్తం.. నేపాల్ పార్లమెంట్ లోప్రధాని బాలెన్ షాప్రశంసలు
మెరుపు వరదలతో అల్లాడిపోయిన నేపాల్కు భారత్ అందించిన ఆపన్నహస్తంపై ఆ దేశ ప్రధాని బాలేన్ షా ప్రశంసలు కురిపించారు. పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ... భారత్, చైనాలు సకాలంలో స్పందించి సహాయక చర్యలకు మద్దతు ఇచ్చాయని తెలిపారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ సాయం తిరస్కరించే ప్రశ్నే తలెత్తబోదని బాలేన్ షా స్పష్టం చేశారు. విపత్తు ప్రభావాన్ని అంచనా వేసేందుకు తమ సాంకేతిక నిపుణులను భారత్, చైనాలు పంపాయని ఆయన చెప్పారు. ఆకస్మిక వరదలు సంభవించిన తొలిరోజు నుంచే నష్టాన్ని అంచనా వేయడానికి ఏరియల్ సర్వేతో పాటు ఇతర మార్గాల్లో పరిస్థితిని గమనించారని నేపాల్ ప్రధాని పేర్కొన్నారు.పరిస్థితులు అనుకూలించిన వెంటనే భారత సాంకేతిక నిపుణుల బృందం మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకుందని వివరించారు. వరద ప్రాంతాల్లో భారీగా బురద, మట్టి పేరుకుపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ అత్యంత కష్టంగా మారిందని బాలేన్ షా అన్నారు. ఎక్స్కవేటర్లు మాత్రమే కాదు.. సైన్యం, రెస్క్యూ సిబ్బంది కూడా నిలబడేందుకు స్థలం లేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.టిబెట్ సరిహద్దుల్లో మంచు చరియలు విరిగిపడి.. భోటేకోషి నది ఉప్పొంగడంతో రసువా ప్రాంతాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ విపత్తుకు వాతావరణ మార్పులే కారణమని నేపాల్ ప్రధాని పేర్కొన్నారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో సమన్వయంతో కూడిన విపత్తు నిర్వహణ వ్యవస్థ అవసరమని ఆయన పిలుపునిచ్చారు.ఇప్పటి వరరకు వరదల్లో మృతుల సంఖ్య 1,200 దాటింది. దాదాపు 5 వేల మంది ఆచూకీ గల్లంతయ్యింది. వారికోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. వరద ప్రాంతాల నుంచి మొత్తం 6,541 మందిని రక్షించాయి. భారీస్థాయిలో మానవతా, సాంకేతిక సహాయాన్ని భారత్ అందించింది. ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ, వైద్య బృందాలు, డీఎన్ఏ ఆధారంగా మృతులను గుర్తించే ఫోరెన్సిక్ నిపుణుల బృందాలను నేపాల్కు పంపింది. వరదల్లో కనీసం 163 మంది భారతీయులను రక్షించినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. దాదాపు 300 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు.అత్యవసర