
కేపీహెచ్ బీలో గజం భూమికి భారీ ధర
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్బీ)లో ఓపెన్ ప్లాట్లు భారీ ధర పలికాయి. కేపీహెచ్బీ 7వ ఫేజ్లోని 16 ఎంఐజీ ప్లాట్లకు హౌసింగ్ బోర్డు బుధవారం బహిరంగ వేలం నిర్వహించింది. చదరపు గజానికి కనీస ధర రూ.1.60లక్షలుగా నిర్ధరించగా.. అత్యధికంగా రూ.2.70లక్షలు పలికినట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి.గౌతమ్ తెలిపారు. మరో ప్లాట్ను చదరపు గజం రూ.2.36 లక్షలకు.. మరో రెండు ప్లాట్లు రూ.2.06 లక్షలకు వేలం పాటలో అమ్ముడుపోయినట్లు చెప్పారు. పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలంలో తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకునేందుకు మొత్తం 19 మంది బిడ్డర్లు పోటీ పడ్డారని.. దీని ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.47.14 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు గౌతమ్ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు